బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (18:32 IST)

రూ.1020కే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ బ్లూటూత్ హెడ్‌సెట్

మొబైల్ తయారీదారు షియోమీ సంస్థ వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్ మార్కెట్‌లో విడుదల చేస్తూ తక్కిన మొబైల్ సంస్థలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇందులో భాగంగానే రెడ్‌మీ ఎయిర్‌డాట్స్ పేరిట ఓ నూతన బ్లూటూత్ హెడ్ సెట్‌ను ఇవాళ విడుద‌ల చేసింది. ఇందులో యాపిల్ సిరి, గూగుల్ వాయిస్‌లకు సపోర్ట్‌ను అందిస్తున్నారు. 
 
ఈ హెడ్‌సెట్ బ్లూటూత్ 5.0 టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుంది. ఇందులో మ్యూజిక్ ప్లేబ్యాక్‌కు టచ్ కంట్రోల్స్ ఇస్తున్నారు. 40 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ హెడ్‌సెట్‌లో అమర్చారు. అందువలన 4 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. కాగా ఈ హెడ్‌సెట్ ధర రూ.1020గా రెడ్‌మీ సంస్థ నిర్ణయించింది.