అమెరికన్లకు మేం ఉద్యోగాలిస్తాం.. ట్రంప్కు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 10 వేల జాబ్స్ సృష్టిస్తామని..?
భారత్లోని ఐటీ సంస్థలు తమ దేశ ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోతున్నాయని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అంటుంటే.. ఇన్ఫోసిస్ షాకిచ్చే ప్రకటన చేసింది. వచ్చే రెండేళ్లలో తాము కొత్తగా 10 వేల జాబ్స్ సృష్ట
వీసాల రద్దు, అవుట్ సోర్సింగ్కు బ్రేక్ వేయడం ద్వారా భారతీయులను అమెరికాలోని ప్రస్తుత సర్కారు దెబ్బకొట్టింది. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా భారతీయులకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల దేశంలోని ఉన్నత వ్యాపారవేత్తలు ఫైర్ అవుతున్నారు. అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు.
అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ కూడా అదే రీతిలో స్పందించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో అమెరికాకు చెందిన పాపులర్ ఆవిష్కరణలైన ఫేస్బుక్, గూగుల్, వాట్సప్లను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.అప్పుడే అమెరికాకు భారత్ సత్తా తెలుస్తుందని ఉద్ఘాటించారు.
ఈ నేపథ్యంలో భారత్లోని ఐటీ సంస్థలు తమ దేశ ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోతున్నాయని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అంటుంటే.. ఇన్ఫోసిస్ షాకిచ్చే ప్రకటన చేసింది. వచ్చే రెండేళ్లలో తాము కొత్తగా 10 వేల జాబ్స్ సృష్టిస్తామని, అయితే ఈ ఉద్యోగాల్లో అంతా అమెరికన్లే ఉంటారని పేర్కొంది.
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత ఆగస్టులో ఇండియానా పాలిస్లో యూఎస్ బేస్డ్ హబ్స్ ప్రారంభిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ఇండియానా సైట్లో 500 ఉద్యోగాలు కల్పిస్తామని, 2021 నాటికి ఇది 2 వేలకు పెరుగుతుందని ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా తెలిపారు. మేమిలా ఓ కొత్త సాంస్కృతిక సాన్నిహిత్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా ఈ ప్రకటనపై వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది.