శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 28 జులై 2016 (14:07 IST)

వందేళ్ళ నాటి మర్రి చెట్టుకు విషమిచ్చి చంపారు... ఎందుకో తెలుసా?

సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది.

సాధారణంగా మనుషులకు, జంతువులను చంపేందుకు విష ప్రయోగం చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ చెట్టును నరికివేసేందుకు విషమిచ్చారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని పెరుంగుడికి సమీపంలో ఇది జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఓ మొక్కను నాటాలని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. కానీ, ఇక్కడ భారీ వృక్షం అడ్డు తొలగించుకునేందుకు విషమిచ్చి చంపినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
వందేళ్ళ వయసు గల ఓ మర్రి చెట్టు ఓ ఐటీ పార్కుకు ఎదురుగా ఉంది. దీన్ని అడ్డు తొలగించాలంటే నగర పాలక సంస్థ అనుమతి కావాలి. దీంతో ఈ మర్రి చెట్టు అడ్డును ఎలా తొలగించాలన్న అంశంపై ఐటీ కంపెనీ యాజమాన్యమే చెట్టుపై విషప్రయోగం చేసి చంపారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. 
 
దాని వేళ్లలోకి మెర్క్యూరీని ఇంజెక్ట్ చేయటం ద్వారా అది ఎండిపోయేలా చేసి దానిని తొలగించాలని చూశారని వారి వాదన. ఇటీవల దానిని పరిశీలించిన నిపుణుల బృందం సైతం 'ఇంత తక్కువ సమయంలో ఆ చెట్టు ఇలా కావడం అనుమానాలకు తావిస్తుంది' అని తేల్చారు. ఇప్పటికే ఆ చెట్టు 80 శాతం ఎండిపోయిన కారణాన్ని చూపుతూ దాని భాగాలు చాలావరకు తొలగించారు. దీంతో హార్టీకల్చర్ నిపుణులు దీనిపై సమగ్రమైన విచారణ జరపాలని ఆ ప్రాంతవాసులు డిమాండ్ చేస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు.