శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 15 జనవరి 2019 (14:43 IST)

ఇరాన్‌లో కూలిన కాలం చెల్లిన విమానం : 15 మంది మృత్యువాత

ఇరాన్‌లో కాలం చెల్లిన సైనిక విమానానికి ఒకటి ప్రమాదానికి లోనైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృత్యువాతపడ్డారు. ప్రతికూల వాతావరణంలో రన్‌వేపై దిగిన ఈ మిలిటరీ కార్గో విమానం అదుపుతప్పి సమీపంలోని భవన సముదాయంలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 15 మంది చనిపోయారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు సమీపంలోని ఫత్ విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిరగింది. ప్రమాద సమయంలో విమానంలో 16 మంది ఉన్నట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సాహా ఎయిర్‌లైన్స్‌కు చెందిన మిలిటరీ కార్గో విమానం బోయింగ్ 707 కిర్గిస్థాన్‌లోని బిష్కెక్ పట్టణం నుంచి మాంసాన్ని తీసుకుని బయలుదేరింది. 
 
టెహ్రాన్‌కు పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్గో విమానం దిగాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పైలట్ అత్యవసరంగా అల్‌బోర్జ్ ప్రావిన్సులోని ఫత్ విమానాశ్రయంలో దించాడు. రన్‌వే పై దిగుతున్న క్రమంలో విమానం అదుపుతప్పి పూర్తిగా ఓ పక్కకు ఒరిగిపోవడంతో ఈ ప్రమాదం వాటిల్లింది.