శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (15:11 IST)

మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా పుట్టాలని ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది.

ఆ యువతి పీజీ పూర్తి చేసింది. దైవారాధన ఎక్కువ. మతపరమైన నమ్మకాలంటే మరీ గుడ్డిగా నమ్మేస్తుంది. పేరు అనిష శర్మ. వయసు 22 సంవత్సరాలు. వచ్చేజన్మలో శివుడికి భర్యగా పుట్టాలని శివుడి గుడిలోనే తనువు చాలించింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
గుర్గావ్ సమీపంలోని షేర్పూర్ గ్రామానికి చెందిన అనిష శర్మ అనే యువతికి దైవారాధన ఎక్కువ. వచ్చే జన్మలో పార్వతిదేవిగా పుట్టాలని భావించింది. ఇందుకోసం తాను ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అదీ కూడా శివుడి గుడిలోనే. 
 
ఈ విషయాన్ని గమనించిన ఆలయ పూజారి గోపాల్ దాస్ స్థానికులకు సమాచారం చేరవేశాడు. ఆ వెంటనే స్థానికులకు వచ్చి ఆ యువతిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఘటనా స్థలంలో యువతి పర్సు, మొబైల్ ఫోను స్వాధీనం చేసుకున్నారు. పర్సులో ఓ లేఖ కనిపించింది. మరుజన్మలో శివుడి భార్య పార్వతిగా అవతరించాలని, అందుకే ఈ తాత్కాలిక ప్రపంచంలో ఉండలేకే తనువు చాలిస్తున్నానని, శివుడు తన కోరిక నెరవేర్చాలని వేడుకొంటున్నట్లు ఆ లేఖలో రాసి ఉంది.