1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 17 జులై 2019 (18:21 IST)

ఆ ఒక్క కాకి అతని బిజినెస్.. లక్షలు కూడబెడుతున్న యువకుడు...

ఎవరూ ఊహించని రీతిలో కర్ణాటకకు చెందిన ఒక యువకుడు కాకిని పెంచుతున్నాడు. ఆ కాకి ద్వారా రోజుకు 500 రూపాయల నుంచి 2 వేల వరకు సంపాదిస్తున్నాడు. కాకి కావాలంటూ ఎవరైనా సంప్రదిస్తే వారి వద్దకు వెళ్ళి పిండాలను తినిపించడమే అతడి పని.

హిందూ సాంప్రదాయంలో ఎవరైనా మరణిస్తే పిండాలను కాకి ముట్టుకుంటేనే మరణించిన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని నమ్ముతున్నారని తెలిసిందే. 
 
ఈ చిన్న ఆలోచన ఎంతో సంపాదనను అందివ్వవచ్చు. ఆలోచనను అమల్లోకి తేవడానికి చేయాల్సిన పని. అదే పని చేస్తున్నాడు ఓ కర్ణాటక యువకుడు. అంతే... అప్పటి నుంచి ఆయన సంపాదన పెరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వాల్సిందే.
 
పట్టణాలు, నగరాల్లో కాలుష్యం కారణంగా కాకుల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. గంటల తరబడి నిరీక్షించినా కాకులు వచ్చి పిండాలను ముట్టుకోవడం లేదు. అదే ప్రశాంత్ పూజారికి కొత్త ఆలోచనను రేకెత్తించేలా చేసింది. ఓ కాకిని పెంచుకోవడం ప్రారంభించి ఎక్కడైనా సమారాధనలు జరిగితే కాకి దొరుకుతుందని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు. దీంతో అప్పటి నుంచి ప్రశాంత్‌కు బాగా కలిసొచ్చింది. రెండు చేతులా సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.