శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 30 మార్చి 2019 (17:01 IST)

రాత్రయితే కన్నకుమార్తెకు మత్తుమందు... నిద్రపోయాక అత్యాచారం....

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కుమార్తె పట్ల కామాంధుడుగా మారాడు. రోజూ ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమె నిద్రలోకి జారుకోగానే అత్యాచారం చేస్తున్నాడు. అతడు చేస్తున్న ఈ దారుణాన్ని ఆ బాలికే పసిగట్టి తండ్రిని కటకటాల వెనక్కి పంపింది. 
 
వివరాలను చూస్తే... ముంబయిలోని మిరా రోడ్‌లో నివాసం వుంటోంది ఆ కుటుంబం. తండ్రి తన మొదటి భార్యతో తలెత్తిన మనస్పర్థల కారణంగా విడాకులిచ్చాడు కానీ తామిద్దరికీ కలిగిన ఇద్దరు అమ్మాయిలను తనే పెంచి పెద్దచేశాడు. ఐతే మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు కనుక మరో యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.
 
ఇక తన మొదటి భార్యకు పుట్టిన ఇద్దర అమ్మాయిలను కూడా రెండో భార్యతో పాటే వుండమన్నాడు. వారలానే వుంటున్నారు. ఈ క్రమంలో తన పెద్ద కుమార్తెపై కన్నేసి కామాంధుడిగా మారిపోయాడు. ఆమెకి అన్నంలో మత్తు మందు కలిపి ఇవ్వడం మొదలుపెట్టాడు. భోజనం చేయగానే పెద్ద కుమార్తె మత్తులోకి జారుకోగానే ఆమెపై అత్యాచారం చేసేవాడు. ఇలా గత కొన్నిరోజులుగా జరుగుతోంది. 
 
తెల్లారిన తర్వాత ఆ బాలిక తన శరీరంలో ఏవో మార్పులు వస్తున్నట్లు అనిపిస్తోంది కానీ వాటికి కారణం ఏమిటో అర్థంకాలేదు. దాంతో ఓ రోజు తండ్రి ఇస్తున్న అన్నాన్ని తింటున్నట్లు నటించి వెళ్లి తన బెడ్రూంలో పడుకుంది. కుమార్తె ఎప్పటిలాగే మత్తులోకి జారుకుందని భావించిన కామాంధుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. వెంటనే ఆమె పెద్దగా కేకలు వేసింది. దాంతో విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ బాలిక తన స్నేహితురాలి సాయంతో స్వచ్చంద సంస్థ దృష్టికి తీసుకెళ్లింది. విషయం పోలీసులకు చేరవేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.