శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 ఆగస్టు 2014 (12:17 IST)

ఫేస్ బుక్‌పై ఏకంగా రూ. 725 కోట్ల కేసు!

సామాజిక వెబ్ సైట్ ఫేస్ బుక్‌కు గట్టి దెబ్బ తగిలింది. అమెరికాకు చెందిన మరియం అనే మహిళ ఏకంగా రూ. 725 కోట్లకు ఫేస్ బుక్‌పై దావా వేసింది. వివరాల్లోకి వెళ్తే... టెక్సాస్‌కు చెందిన మరియం, ఇల్లినాయిస్‌కు చెందిన అదీల్ షా ఖాన్ ఇద్దరూ స్నేహితులు. కొన్ని విభేదాలతో ఇద్దరూ విడిపోయారు.
 
మరియంపై కోపం పెంచుకున్న అదీల్ షా... మరియం పేరుతో పేస్ బుక్ ఖాతా తెరిచి... ఆమెకు సంబంధించిన అశ్లీల నకిలీ ఫొటోలను అప్ లోడ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న మరియం ఆ ఫొటోలను తీసివేయాలని ఫేస్ బుక్‌కు విన్నవించింది. 
 
అయినా, ఫేస్ బుక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన విన్నపాన్ని ఉద్దేశపూర్వకంగానే ఫేస్ బుక్ విస్మరిస్తోందని మరియం కోర్టు కెక్కింది. ఏకంగా రూ. 725 కోట్ల నష్టపరిహారం కోరుతూ దావా వేసింది.