శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 17 మే 2018 (10:27 IST)

రండి బాబోయ్.. రండి... కర్ణాటకలో జోరుగా గుర్రాల బేరాలు : సినీ నటి రమ్య

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకావడంపై కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి రమ్య కామెంట్స్ చేశారు. రండి.. బాబోయ్.. రండి.. కర్ణాటకలో గుర్రాల బేరాలు జరుగుతున్నాయంట

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటుకావడంపై కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి రమ్య కామెంట్స్ చేశారు. రండి.. బాబోయ్.. రండి.. కర్ణాటకలో గుర్రాల బేరాలు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.
 
ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె స్పందిస్తూ, గుర్రాల సంతలో బేరాలు. కర్ణాటకలోనూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిలో బీజేపీ బిజీగా ఉందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఆరోపించారు. గతంలో పీయుష్ గోయల్ మధ్యవర్తిగా గుజరాత్ ఎన్నికల్లో అనేకమంది ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. 
 
ఇదిలావుండగా, తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికీ లొంగబోరని కాంగ్రెస్ నేత, కర్ణాటక వ్యవహారాల ఇన్ చార్జ్ గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రలోభాలకు తెరలేపిన మాట వాస్తవమేనని, అయితే, తమ ఎమ్మెల్యేలు వాటికి లొంగరన్న విశ్వాసం తమకుందని ఆయన చెప్పారు.