నాయకత్వ లోపంతోనే రాహుల్ సోదరిని తెచ్చుకున్నారా?: స్మృతి ఇరానీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలోని నాయకత్వ లోపం తెలుసుకుని సోదరిని తెచ్చుకున్నారా? అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ప్రియాంకా గాంధీ అయినా పూర్తి కసరత్తు చేసి అమేథీలో అడుగుపెట్టాల్సిందని ఇరానీ సూచించారు.
అమేథీలో అలాహాబాద్కు చెందిన ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఉందని ఆమె గుర్తు చేశారు. మరో ట్రిపుల్ ఐటీ ఎలా వస్తుందని ప్రియాంకా గాంధీ చేసిన విమర్శలపై స్మృతి ఇరానీ స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
ఇంకా అమేథీలో గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని నియోజకవర్గం అభివృద్ధి చేయమంటున్నారు ఇదెక్కడి విడ్డూరం అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ అడిగారు. ఆరుదశాబ్ధాలుగా పెట్టని కోటగా ఉన్న అమేథీని అభివృద్ధి చేయని కాంగ్రెస్, ఓడిపోయిన తనను అభివృద్ధి చేయాలంటూ అడుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.