శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 20 అక్టోబరు 2014 (21:11 IST)

దీపావళి బాణసంచాతోపాటు ఉగ్రవాదుల పేలుళ్లకు కుట్ర... ఐబీ హెచ్చరిక

దేశంలో మరోసారి ఉగ్ర దాడులకు తీవ్రవాదులు పాల్పడే అవకాశం ఉన్నట్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు బాణసంచాను కాలుస్తూ సంతోషంగా ఉండే పండుగ దినాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శించకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు పంపింది.