శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (12:59 IST)

అస్సోంపై దాడికి అల్‌ఖైదా కుట్ర : తరుణ్ గగోయ్

ఈశాన్య రాష్ట్రమైన అస్సోంపై దాడికి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ అల్‌ఖైదా కుట్రపన్నిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ చెప్పారు. అలాగే, అస్సాం భూభాగంలోకి చొరబడేందుకు అల్ ఖైదా ప్రయత్నిస్తోందన్నారు. అంతేగాక ఆ టెర్రర్ గ్రూపు రాష్ట్రంలో స్థావరం ఏర్పాటు చేసుకునేందుకు, ఉల్ఫా (యూఎల్ఎఫ్ఏ)తో రహస్య ఒప్పందం కూడా చేసుకుందని మీడియా ముఖంగా ప్రకటించారు. 
 
ఈ మేరకు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. ఈ క్రమంలో వారి చొరబాటును నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంబంధిత జాగ్రత్తలన్నీ తీసుకుంటామని తెలిపారు. ఇటీవల భారత్‌లో అల్ ఖైదా తన శాఖను ప్రారంభించడం, అటు భారత్‌లో ఆ సంస్థ విఫలమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం.