శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:28 IST)

మహారాష్ట్ర ఎన్నికలు : హలో ఉద్ధవ్.. అమిత్ షా ఫోను!

మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా బీజేపీ-శివసేన కూటమి విభేదాలకు చెక్ పెట్టేందుకు అమిత్ షా రంగంలోకి దిగారు. ఇరవై ఐదేళ్ల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన బీజేపీ-శివసేన కూటమిలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీవ్ర విభేదాలు ఏర్పడే పరిస్థితి నెలకొంది. దాంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 
 
వెంటనే శివసేన అధినేత ఉద్ధవ్ థాకరేకు ఫోన్ చేసి కూటమిని విచ్ఛిన్నం చేసేలా వ్యవహరించవద్దని కోరారు. సీట్ల సర్దుబాటులో బీజేపీకి ఇస్తామన్న 119 స్థానాల ప్రతిపాదన 'అసాధ్యమైనది' అనీ, ఆ విషయంలో మరోసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.