శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 24 మే 2016 (17:00 IST)

కోయంబత్తూర్ ఆటో డ్రైవర్ వెరైటీ సెలబ్రేషన్: ''అమ్మ'' కోసం రూపాయికే ఆటో సవారీ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ప్రజలు మళ్లీ అమ్మకే పట్టం కట్టారు. ''అమ్మ'' గెలుపును పండగ చేసుకుంటారు. కార్యకర్తలు, అభిమానులు మళ్లీ అమ్మ అధికారంలోకి వచ్చిందని.. అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నారు. తాజాగా కోయంబత్తూరుకు చెందిన జయ వీరాభిమాని అయిన ఓ ఆటో డ్రైవర్ వెరైటీగా అమ్మ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 
 
తన ఆటోలో ఎక్కే ప్రయాణీకులు ఎక్కడి నుంచి ఎక్కడి వెళ్లినా వాళ్ల దగ్గర కేవరం రూపాయి మాత్రమే ఆటో ఛార్జీగా తీసుకుంటున్నారు. ఈ విధంగా ఒక్క రోజులో 102 రూపాయలు సంపాదించానని, 102 మందిని వారి గమ్యాలను చేర్చినట్లు ఆ ఆటో డ్రైవర్ ఆర్‌ఎం మత్తివనన్ వెల్లడించారు. ఇందుకోసం ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని మానేశానని.. ఉదయం 6 గంటలకు రోడ్డెక్కిన ఆటో సాయంత్రం 6 గంటలకే ఆగుతుందన్నారు.