ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 2 ఏప్రియల్ 2018 (15:12 IST)

విత్తమంత్రికి సారీ చెప్పిన ఢిల్లీ సీఎం.. ఎందుకు?

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు.

కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారీ చెప్పారు. ఈయన ఇప్పటికే మంత్రి నితిన్ గడ్కరీ, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్‌కు కూడా క్షమాపణలు చెప్పారు. ఆయనతో పాటు.. మరో ముగ్గురు ఆప్ నేతలు కూడా జైట్లీకి సారీ లేఖలు పంపిన వారిలో ఉన్నారు. 
 
తాజాగా ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డారని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు గుప్పించారు. దీంతో జైట్లీ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో జైట్లీకి సారీ చెపుడూ కేజ్రీవాల్ ఓ లేఖను రాశారు. 
 
తనపై చేసిన ఆరోపణలను సవాలు చేస్తూ అరుణ్ జైట్లీ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఇప్పుడు జైట్లీ తన కేసును వెనక్కి తీసుకునే అవకాశముంది. అలాగే, నితిన్ గడ్కరీ కూడా తాను వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, కేజ్రీవాల్ వరుస సారీలపై ఆప్ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తొలుత మాట జారడం ఆ తర్వాత సారీలు చెప్పడం ఏమాత్రం సబబుగా లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిలకు కూడా ఆయన సారీ చెప్పే అవకాశాలు ఉన్నాయి.