శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (10:20 IST)

3 అడుగుల గుంతలో ప్రాణాలతో ఉండగానే 19 ఏళ్ల యువతిని పూడ్చి పెట్టారు (Video)

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్త

తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేసి నిర్మిస్తున్న అక్రమ భవనాన్ని అడ్డుకున్నందుకు 19 యేళ్ళ యువతిని మూడు అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టిన ఘటన ఒకటి బీహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహాహ్ రాష్ట్రంలోని గోవిందపూర్ గ్రామంలో అమిత్ షా అనే వ్యాపారి ఉన్నాడు. ఈయన సంజన, అన్సారీ అనే దంపతుల స్థలాన్ని కబ్జా చేసి.. అక్కడ ఓ భవనాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేశాడు. ఈ భవన నిర్మాణానికి వారు అంగీకరించలేదు. దీనిపై గతంలో పలు మార్లు అమిత్ షా వారిని బెదిరించాడు. 
 
ఆ బెదిరింపులను వారు పట్టించుకోకపోవడంతో వారి ఇంటిపై దాడి చేసిన ఇద్దరు దుండగులు... వారిని హెచ్చరించేందుకు ఇంట్లో ఉన్న వారి కుమార్తె ఖుష్బూ (19)ను కొట్టి, బలవంతంగా లాక్కెళ్లి దగ్గర్లో ఉన్న 3 అడుగుల గుంతలో ప్రాణాలతోనే పూడ్చిపెట్టారు.
 
తమ కుమార్తె కనిపించక పోవడంతో అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం చుట్టుపక్కల గాలించారు. ఇంతలో అక్కడ కొత్తగా గుంత కనిపించడంతో దానిని తవ్వి చూడగా ఖుష్బూ స్పృహ కోల్పోయి కనపించింది. దీంతో గ్రామస్థుల సాతంతో ఆ యువతిని వెలికి తీశారు. 
 
షాక్‌‌కు గురైన ఖుష్బూ కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై అమిత్ షాపై పోలీసులకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఖుష్బూను గుంతలోనుంచి తీస్తున్న వీడియోను వారు పోలీసులకు అందజేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.