బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2017 (12:39 IST)

బార్బర్ షాపులో పనిచేసే వ్యక్తి ఆ పని చేశాడని.. ఉమ్మిని నాలుకతో.. చెప్పులతో?

బార్బర్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంటి బయట ఉమ్మేశాడని.. తలుపు తట్టకుండా లోపలికి వెళ్లాడనే ఉద్దేశంతో.. ఆ వ్యక్తి నేలపై ఉమ్మేసిన ఉమ్మిని అతడి నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన అమానవీయ

బార్బర్ షాపులో పనిచేస్తున్న వ్యక్తి.. ఇంటి బయట ఉమ్మేశాడని.. తలుపు తట్టకుండా లోపలికి వెళ్లాడనే ఉద్దేశంతో.. ఆ వ్యక్తి నేలపై ఉమ్మేసిన ఉమ్మిని అతడి నాలుకతోనే నాకించి, మహిళలతో చెప్పులతో కొట్టించిన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని నలందా జిల్లాలో ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు.. బార్బర్ షాపు పెట్టుకుని జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి ఖైనీ కోసం పొరిగింటిలో నివసించే సర్పంచ్ సురేంద్ర యాదవ్ ఇంటికి వెళ్లాడు. వెళ్తూవెళ్తూ బయట ఉమ్మి వేశాడు. తలుపు కొట్టకుండా లోపలికి ప్రవేశించాడు. ఆ సమయంలో ఇంట్లో పురుషులు కూడా ఎవరూ లేకపోవడంతో అతను దురుద్దేశంతోనే వచ్చాడని అందరూ భావించారు. 
 
ఈ ఘటనపై పంచాయతీ జరిగింది. సురేంద్రయాదవ్ బాధితుడిని మహిళల చెప్పులతో కొట్టించాడు. అనంతరం ఘటనా స్థలానికి తీసుకెళ్లి వేసిన ఉమ్మిని నాలుకతో నాకించినట్టు బీహార్ షరీఫ్ ఎస్‌డీఓ సుధీర్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి నంద్ కిషోర్ యాదవ్ ఇటువంటి వాటిని సహించబోమని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.