శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (09:15 IST)

అల్లుడుని జైలుకు పంపిన అత్తామామలు.. ప్రియుడుతో కుమార్తె రహస్య సహజీవనం...

బీహార్ రాష్ట్రంలో విచిత్ర కేసు ఒకటి వెలుగు చూసింది. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లుడు జైలుపాలయ్యాడు. అదేసమయంలో పుట్టింటి నుంచి మాయమైన కుమార్తె... త

బీహార్ రాష్ట్రంలో విచిత్ర కేసు ఒకటి వెలుగు చూసింది. తన కుమార్తెను అల్లుడే హత్య చేశాడని అత్తామామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అల్లుడు జైలుపాలయ్యాడు. అదేసమయంలో పుట్టింటి నుంచి మాయమైన కుమార్తె... తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియుడితో రహస్యంగా సహజీవనం చేస్తూ వచ్చింది. చివరకు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తాము చేసిన తప్పును తెలుసుకుని నిర్ఘాంతపోయి, పోలీసులకు సమచారం అందించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన పింకీ అనే యువతికి 2015లో మనోజ్ శర్మ అనే యువకుడితో వివాహమైంది. పెళ్లి అయిన కొన్ని నెలలకే ఆశ్చర్యకరంగా పింకీ మాయమైంది. దీంతో తమ కూతురు పింకీని కట్నం కోసం అల్లుడే వేధించి చంపాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సారియా పోలీసులు కేసు నమోదు చేసి.. కొన్ని రోజుల తర్వాత కుళ్లిపోయి గుర్తుతెలియకుండా ఉన్న ఓ మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. దీన్ని పరిశీలించిన పింకీ తల్లిదండ్రులు.. ఆ మృతదేహం తమ కూతురే అని గుర్తించారు. 
 
దీంతో మనోజ్ శర్మను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు. తమ కూతురు ప్రియుడితో కలిసి జబల్ పూర్ నగరంలోని కంటోన్మెంటు ప్రాంతంలో రహస్యంగా సహజీవనం కొనసాగిస్తుందని జైలులో ఉన్న మనోజ్ శర్మతోపాటు అతని తల్లిదండ్రులకు తెలిసింది. పెళ్లికి ముందే పింకీకి మయూర్ మలిక్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం సాగిందని, పెళ్లి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా మనోజ్ శర్మతో జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందువల్లే భర్త నుంచి మాయమైన పింకీ తన ప్రియుడితో కలిసి సహజీవనం కొనసాగిస్తూ వచ్చిందని తెలిపింది.