శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 16 జులై 2017 (12:10 IST)

174 మంది ప్రాణాలు తీయబోయిన పక్షి.. ఎలా?

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన

ఓ పక్షి ఏకంగా 174 మంది ప్రాణాలు తీయబోయింది. ఫలితంగా రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
ఎయిర్ ఆసియాకు చెందిన విమానం బిర్సాముండా ఎయిర్‌ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన తక్షణం అప్రమత్తమైన పైలెట్... విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం బ్లేడ్లు దెబ్బతిన్నాయి. 
 
దీంతో విమానం చుట్టూత చుట్టూ దట్టమైన పొగ రావడంతో, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్‌లను తెరచి, ప్రయాణికులను దింపివేశారు. ఈ ఘటనలో విమానం పాక్షికంగా దెబ్బతింది.