శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 13 జులై 2018 (18:59 IST)

అమిత్ షా తెలంగాణ టూర్.. రామాలయ నిర్మాణ పనులు ఏమయ్యాయి?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షా

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాదుకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడకుండా వెళ్లిపోయిన అమిత్ షా అలిగారని బీజేపీ వర్గాల టాక్. అమిత్ షాకు ఆహ్వానం పలికేందుకు వస్తే అలా మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏమిటని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు హైదరాబాదులో బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీతో అమిత్ షా భేటీ అయ్యారు. గతంలో చెప్పిన పనులు చేయకపోవడంపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.. కానీ ఆ పనులు మందకొడిగా సాగడంపై అమిత్ షా ఫైర్ అయ్యారు.  
 
వచ్చేనెల 15వ తేదీలోగా పని పూర్తి చేయాలని నేతలకు టార్గెట్ ఇచ్చారు. యాత్రలు చేయాలని సూచించారు. యాత్రలో ప్రతి గ్రామాన్ని టచ్ చేయాలన్నారు. ఆగస్టులో 15 రోజుల యాత్రకు ప్లాన్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో నేతలకు, కార్యకర్తలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని అమిత్ షా సూచించారు.