శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 23 అక్టోబరు 2014 (14:41 IST)

నల్లధనం కుబేరుల జాబితాపై అరుణ్ జైట్లీకి దిగ్విజయ్ సవాల్!

నల్లధనం కుబేరుల జాబితా వెల్లడిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బహిరంగ సవాల్ విసిరారు. దమ్ముంటే ఆ జాబితాను బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై డిగ్గీరాజా మాట్లాడుతూ నల్లధనం జాబితాలో కాంగ్రెస్ నేతల పేర్లున్నాయంటూ పేర్లను లీక్ చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ధ్వజమెత్తారు. దమ్ముంటే జాబితాలోని పేర్లను వెల్లడించాలని అరుణ్ జైట్లీకి సవాల్ విసిరారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 
 
కాగా, బుధవారం ఆర్థిక మంత్రి జైట్లీ మీడియాతో మాట్లాడుతూ, విదేశాల్లో నల్లధనం దాచిన వివరాలు వెల్లడైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల పాలవుతుందని... యూపీఏ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి పేరు లిస్టులో ఉందంటూ ఓ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన విషయం తెల్సిందే. దీనిపై కాంగ్రెస్ నేతలు మండిపడుతూ అరుణ్ జైట్లీకి బహిరంగ సవాల్ విసురుతున్నారు.