శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (16:04 IST)

ఇంట్లో ఎవరూ లేరని రమ్మంది.. వార్డ్‌రోబ్‌లో దాచేసింది!

దేశంలో ఒకవైపు అరాచకాలు, అత్యాచారాలు, వేధింపులు పెచ్చరిల్లిపోతుంటే.. ప్రేమ పేరిట యువతీయువకులు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ఇంట్లో అమ్మా నాన్న ఎవరూ లేకపోవడంతో తన ప్రియుడిని ఓ యువతి కాల్ చేసి ఇంటికి రమ్మంది. అయితే చెప్పిన  చెప్పిన సమయం కంటే కాస్త ముందే తల్లిదండ్రులు వచ్చేయడంతో ఆ యువతికి చుక్కెదురైంది. 
 
ఇంటికి రమ్మన్న ప్రియుణ్ణి తల్లిదండ్రులు రావడంతో వార్డ్ రోబ్‌లో దాచేసింది. కాసేపు ఎలాగో నెట్టుకొచ్చిన అతగాడు, కాలం గడిచేకొద్దీ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యాడు. 'ఎంతసేపు ఇలా' అంటూ ప్రేయసికి ఓ ఎస్సెమ్మెస్ కూడా పంపాడు. ఫలితం లేకపోవడంతో, వెంటనే వార్డ్ రోబ్ లోంచి దభీమని దూకేశాడు. ఈ అనుకోని అతిథిని చూసి ఆ యువతి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. తేరుకుని అతగాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
 
ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో చోటుచేసుకుంది. స్మిత, రాహుల్ ప్రేమికులు. ఓ రోజు స్మిత తల్లిదండ్రులు ఊరెళ్ళారు. దీంతో, సాయంత్రం వరకు ఊసులాడుకోవచ్చని స్మిత, రాహుల్‌కు కాల్ చేసింది. ఈ క్రమంలోనే సీన్ అడ్డం తిరిగింది. తల్లిదండ్రులు ఓ రోజు ముందుగానే రావడం, రాహుల్ దొరికిపోవడం జరిగాయి. తమ కుమార్తెను వేధిస్తున్నాడంటూ స్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం రాహుల్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.