శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (15:15 IST)

ప్రేమించలేదని పదిమంది యువతులకు వేధింపులు.. ఎఫ్‌బీలో ఫోటోలు.. చెన్నైలో..?

యువతిని లోబరుచుకోవాలనుకున్నాడు. కాదు పొమ్మంది. అంతే ఆమె ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం

యువతిని లోబరుచుకోవాలనుకున్నాడు. కాదు పొమ్మంది. అంతే ఆమె ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆ యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. చెన్నై చిందాదిరిపేట్టైకి చెందిన పోలీస్ స్టేషన్‌లో అదే ప్రాంతానికి చెందిన మహిళ తన కుమార్తె ఓ యువకుడి చేతిలో మోసపోయినట్లు ఫిర్యాదు చేసింది. తన కుమార్తె అర్ధనగ్న ఫోటోలు ఫేస్ బుక్‌లో శ్యాముయేల్ అనే యువకుడు పోస్ట్ చేసాడని ఫిర్యాదు చేసింది.
 
ప్రేమ పేరుతో తన బిడ్డను వేధించాడని తెలిపింది. ప్రేమించలేదనే కోపంతో తన కుమార్తె ఫోటోలను గ్రాఫిక్స్ చేసి ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశాడని ఆ తల్లి ఆరోపించింది. ఇదే తరహాలో అనేకమంది యువతులను బెదిరించాడని, అతనిని అరెస్ట్ చేయాల్సిందిగా కోరింది. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు ఈ కేసులో శ్యాముయేల్ నిందితుడని కనుగొన్నారు. ఈ యువకుడు కళాశాల విద్యార్థులు 10 మందిని మోసం చేసినట్లు తెలిసింది. కానీ పరారీలో ఉన్న ఆ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.