శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (09:41 IST)

ఇంట్లో ఒంటరిగా ఉంది.. వివాహితపై అత్యాచారయత్నం.. ప్రతిఘటించిందని సజీవదహనం..

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన

దేశంలో మహిళలపై దురాగతాలు పెచ్చరిల్లిపోతున్నాయి. బాలికల నుంచి ముదుసలి వరకు వావి వరసలు లేకుండా అత్యాచారాలను పాల్పడుతున్న కామాంధుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా సాక్షాత్తు భర్త బంధువు చేసిన అత్యాచార యత్నాన్ని ప్రతిఘటించిందనే కోపంతో ఓ మహిళను సజీవదహనం చేసిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా, ఉర్గా పోలీసుస్టేషను పరిధిలోని మడ్వారనీ గ్రామానికి చెందిన 30 ఏళ్ల వివాహిత ఇంట్లో ఒంటరిగా ఉండగా.. భర్త బంధువు రమేష్ పటేల్ ఇంటికొచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. 
 
అయితే ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అంతే కోపంతో ఊగిపోయిన ఆ కామాంధుడు.. వివాహిత ఒంటిపై కిరోసిన్ నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న రమేష్ పటేల్ కోసం గాలిస్తున్నారు.