శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:57 IST)

బీజేపీ నేతలు చేసిన పనికి సారీ చెపుతున్నా : అశోకగజపతిరాజు

ఎయిరిండియా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పించేలా బీజేపీ నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చేసిన పనులకు తాను క్షమాపణలు చెపుతున్నట్టు కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖామంత్రి పూసపాటి అశోకగజపతిరాజు తెలిపారు. 
 
గురువారం విదేశీ పర్యటనకు వెళ్లిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కాశ్మీర్ వెళ్లిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్వాకం కారణంగా ఎయిరిండియా విమానాలు సుమారు గంటసేపు ఆలస్యంగా నడిచాయి. ఈ కారణంగా ఈ విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు, అసౌకర్యానికి గురికాగా, పెను చర్చనీయాంశమైంది. 
 
ఈ విషయం తెలుసుకున్న మంత్రి అశోకగజపతిరాజు స్పందించారు. ప్రజల్లోకి వెళ్లిన సమాచారం ప్రకారం చూస్తే, ఈ అంశం ప్రతివాదనకు తావులేనిదన్నారు. మంత్రుల నిర్వాకం వల్ల ఎవరెవరికి ఇబ్బంది కలిగిందో వారందరికీ సంబంధిత శాఖామంత్రిగా క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అసలు జరిగిందేమిటో తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.