శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 జనవరి 2015 (19:15 IST)

రాజీనామాకు ముందే అమిత్ షాతో జయంతి నటరాజన్ భేటీ!

రాజీనామాకు ముందే అమిత్ షాతో జయంతి నటరాజన్ భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 
 
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో అమిత్ షాతో జయంతి నటరాజన్ మాట్లాడినట్టు తెలుస్తోంది. కాగా, ఈ వార్తలను బీజేపీ ఖండించింది. ఆమెతో తమ పార్టీ నేతలు ఎటువంటి చర్చలు జరపలేదని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు.