శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 19 మే 2015 (15:34 IST)

అత్తకు అన్నం పెట్టని కోడళ్ళకు తలా 20 కొరడా దెబ్బలు.. ఎక్కడ...?!

అత్తకు అన్నం పెట్టేందుకు నిరాకరించిన ఇద్దరు కోడళ్ళకు తలా 20 చొప్పున కొరడా దెబ్బలు కొట్టాల్సిందేనంటూ ఓ గ్రామ పంచాయతీ తీర్పునిచ్చింది. దీంతో గ్రామ ప్రజలు ఆ శిక్షను అమలు చేశారు. ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు కోడళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని మొరాదాబాద్ జిల్లా సాలవ గ్రామానికి చెందిన ఇద్దరు కోడళ్లు.. తమ అత్తకు సేవ చేసేందుకు, అన్నం పెట్టేందుకు, బట్టలు ఉతికేందుకు ఇష్టపడలేద కదా పూర్తిగా నిరాకరించారు. ఈ విషయం గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లింది అత్త. దీంతో ఇరు పక్షాల వాదనలూ విన్న పెద్దలు కోడళ్లకు చెరో 20 కొరడా దెబ్బల శిక్ష వేశారు. 
 
ఆ వెంటనే శిక్షను అమలు చేయడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘటనపై నిజానిజాలు తెలుసుకునే నిమిత్తం విచారణ చేపట్టామని తెలిపారు.