శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (15:28 IST)

కుమార్తెను పోగొట్టుకున్న తండ్రికి నరకం చూపిన వైద్యులు.. మోపెడ్‌పై శవం తరలింపు

ఆ మధ్య ఒరిస్సా రాష్ట్రంలో అంబులెన్స్ అందుబాటులో లేక భార్య శవాన్ని భుజంపై వేసుకుని నడిచి స్వగ్రామానికి చేరుకున్నాడో భర్త. ఈ ఘటన మరువకముందే.. మరో ఘటన కర్నాటక జిల్లాలో జరిగింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న

ఆ మధ్య ఒరిస్సా రాష్ట్రంలో అంబులెన్స్ అందుబాటులో లేక భార్య శవాన్ని భుజంపై వేసుకుని నడిచి స్వగ్రామానికి చేరుకున్నాడో భర్త. ఈ ఘటన మరువకముందే.. మరో ఘటన కర్నాటక జిల్లాలో జరిగింది. కన్నబిడ్డను పోగొట్టుకున్న ఓ తండ్రికి ఆస్పత్రి వైద్యులు ప్రత్యక్ష నరకం చూపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కర్నాటకలోని తుమకూరు జిల్లా మధుగురి తాలూకాకు చెందిన తిమ్మప్ప కుమార్తె రత్నమ్మ(20) అనారోగ్యంతో బాధపడుతుండగా కొడిగేనహళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే తగిన వైద్య సేవలు లభించకపోవడంతో పాటు... ఆస్పత్రిలో వైద్యులు లేనికారణంగా పరిస్థితి విషమించి రత్నమ్మ మృతి చెందింది. 
 
మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నించగా అంబులెన్స్ అందుబాటులో లేదని ఆసుపత్రి అధికారులు బదులిచ్చారు. దీంతో చేసేదిలేక నిరుపేద కుటుంబానికి చెందిన తిమ్మప్ప వేలరూపాయల ఖర్చుతో ప్రైవేట్ అంబులెన్స్‌ను సమకూర్చుకునే స్తోమత లేక పరిచయస్తుడి మోపెడ్‌పైనే కన్నబిడ్డ మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు.