శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (11:01 IST)

రూ.186 కోట్ల నీటి సర్ ఛార్జీలు రద్దు..! కేజ్రీవాల్ హోలీ కానుక..!

అసెంబ్లీ ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బంపర్ ఆపర్ ప్రకటించారు. హోలీ పర్వదినానికి ఒక్క రోజు ముందుగా ఆయన తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ప్రజలను ఆనంద డోలికల్లో ఊగిస్తోంది. 
 
నీటి బిల్లుల జాప్యానికి చెల్లించాల్సిన సర్ ఛార్జీలు రూ.186 కోట్లను రద్దు చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా గురువారం ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఢిల్లీ జల బోర్డు ఛైర్మన్ హోదాలో ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్త తమకు అసలైన హోలీగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.