శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (12:38 IST)

ఢిల్లీ పోల్స్ : ఆప్ - బీజేపీ అభ్యర్థులూ అవినీతిపరులే..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కూడా ఎక్కువ మంది అవినీతి పరులు ఉన్నారు. అలాంటి వారికే ఆ రెండు పార్టీలు టిక్కెట్లు కేటాయించాయి. అభ్యర్థి గత చరిత్రను పక్కనబెట్టి, నేరాలు చేసిన నేపథ్యమున్నా టికెట్లు ఇచ్చాయి. 
 
ఈ విషయంలో రాజకీయాలను ప్రక్షాళన చేస్తామని వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తీసిపోలేదు. ఆ పార్టీ టికెట్లు ఇచ్చిన వారిలో 23 మంది పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. 
 
ఇక బీజేపీ విషయానికి వస్తే 29 మంది నేర చరితులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వారిలో 21 మందికి నేర చరిత్ర ఉంది. మొత్తం 673 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వీరిలో 17 శాతం మందిపై వివిధ క్రిమినల్ కేసులు ఉండటం గమనార్హం.