1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (10:23 IST)

మహిళా టాయిలెట్‌లో సెల్‌ఫోన్.. అనుమానంతో తీసి చూస్తే.. వామ్మో...?

సాంకేతికత పెరిగే కొద్దీ మహిళలకు భద్రత కరువవుతోంది. ఓ వైపు కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కెమెరాలతో మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హోటల్‌వున్న మహిళల టాయ్‌లెట్‌

సాంకేతికత పెరిగే కొద్దీ మహిళలకు భద్రత కరువవుతోంది. ఓ వైపు కామాంధులు వయోబేధం లేకుండా మహిళలపై విరుచుకుపడుతుంటే.. మరోవైపు కెమెరాలతో మహిళలపై దురాగతాలు పెరిగిపోతున్నాయి. తాజాగా హోటల్‌వున్న మహిళల టాయ్‌లెట్‌లో సెల్‌ఫోన్‌తో అశ్లీల చిత్రాలను చిత్రీకరిస్తున్నట్లు గుట్టు రట్టయింది.


బాత్రూంకి వెళ్లిన ఓ మహిళకు వీడియో తీస్తున్నారన్న అనుమానంతో వెలుపలికి వచ్చి చూడగా షాక్ తింది. ఈ ఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో వెలుగు చూసింది.  
 
వివరాల్లోకి వెళితే.. సదరు రెస్టారెంట్‌కి వచ్చిన ఓ మహిళ బాత్రూంకు వెళ్లింది. గదిలో ఓ చోట మొబైల్‌ ఫోన్‌ ఉండడం గమనించింది. వీడియో తీస్తున్నారేమోనన్న అనుమానంతో పరిశీలించగా నిజమని తేలింది. అందులో చాలామంది నగ్న వీడియోలు ఉండడం చూసి షాక్ తింది. అంతేగాకుండా వాటిలో కొన్నింటిని వాట్సాప్‌లో షేర్ చేసి వుండటాన్ని గమనించిన ఆమె షాకైంది. 
 
అంతే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సదరు మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. విచారణలో హోటల్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఓ కార్మికుడు ఈ వ్యవహారానికి మూల కారకుడని పోలీసులు గుర్తించారు. అంతేగాకుండా అతనిని అరెస్ట్ చేశారు. నిందితుడితోపాటు హోటల్‌ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.