శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (13:40 IST)

బస్సు మిస్సయింది.. కారు ఎక్కింది... ముగ్గురు కామాంధుల చేతిలో నలిగిపోయింది...

ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే,

ఢిల్లీలో మరో నిర్భయ తరహా ఘటన జరిగింది. 12 యేళ్ల బాలిక ముగ్గురు కామాంధులు చేతిలో నలిగిపోయింది. ఈ దారుణం ఈనెల 18వ తేదీన జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే..
 
గ్రేటర్ నోయిడాకు చెందిన ఓ బాలిక 12వ తరగతి చదువుతోంది. ఆ యవతి ఈనెల 18వ తేదీన పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో స్కూలు బస్సు మిస్సైంది. దాంతో ఆ బాలిక ఇంటికి నడిచి వెళ్లాలని నిర్ణయించుకుని రోడ్డుపైకి వచ్చింది. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు అబ్బాయిలు.. తనను ఇంటి వద్ద దించుతామని నమ్మించడంతో ఆ బాలిక కారు ఎక్కింది.
 
కొద్దిదూరం వెళ్లాక ఆ బాలిక నోట్లో బట్టలు కుక్కి, ఆ తర్వాత రేప్‌కు ప్రయత్నించారు. ఓ మత్తు పానీయాన్ని కూడా ఆమెకు తాగించారు. తమ కూతురు రాత్రి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 2 గంటల సమయంలో నాలెడ్జ్ పార్క్ ఏరియాలో మత్తులో ఆ యువతిని గుర్తించారు. హాస్పటల్‌కు తీసుకువెళ్లి వైద్యం చేయగా, ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు కామాంధుల కోసం గాలిస్తున్నారు.