శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:59 IST)

భర్తను హత్య చేయించిన భార్య.. స్నేహితురాలితో చేతులు కలిపి...

తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడేమోనని అనుమానించిన ఓ భార్య అతనిని హత్య చేయించిన సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ఘజియాబాదులో జరిగింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన రబియా అనే మహిళకు భర్త దిల్షాన్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సంసారం చేసుకోవాల్సిన రబియాని అనుమానం పెనుభూతంలా వేధించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఆమె అనుమానాన్ని మరింత పెంచేశాయి.
 
దీంతో తన స్నేహితులతో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ చేసింది. ఘజియాబాద్‌కు చెందిన పోలీసులు గ్యాంగ్ నెహర్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఓ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె కిరాయి హంతకుడిని మాట్లాడి ముందస్తుగా పదివేల రూపాయలు చెల్లించి మర్డర్ ప్లాన్ అమలు చేసింది. 
 
రాత్రి భోజనం చేసిన అనంతరం భార్య తన భర్తకు పాల గ్లాసులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లగానే తన స్నేహితురాలు, ఆమె భర్త, మరో కిరాయి హంతకుడితో కలిసి భర్త గొంతు నులిమి చంపింది. అనంతరం అతడికి బురఖా వేసి శవాన్ని మాయం చేసే క్రమంలో వారు వాహనంలో పట్టుబడ్డారు. పోలీసులు ముగ్గురు నిందితులను, అతని భార్యను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.