మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 25 జూన్ 2019 (15:28 IST)

ఎన్.హెచ్-5లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్... ఎందుకో తెలుసా?

హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి నంబరు ఐదులో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కిన్ననూర్ ప్రాంతంలోని కషంగ్ నలా అనే ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగా భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. 
 
ఈ విషయం తెలుసుకున్న జాతీయ రహదారుల మరమ్మతు విభాగం అధికారులు జేసీబీల సహాయంతో ఈ కొండ చరియలను తొలగించే పనులను ముమ్మరం చేశాయి. ఈ కొండ చరియలకు విరిగిపడుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.