శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 29 జులై 2016 (08:48 IST)

పేకాటలో పోయిన డబ్బులివ్వకుంటే చంపేసేలా ఉన్నాడన్న భార్య... మరుసటి రోజు శవమైంది!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ జూదగాడు.. పేకాటలో డబ్బు పోవడాన్ని తట్టుకోలేక ఆ కోపాన్ని భార్యపై చూపించాడు. ఫలితంగా ఆమెకు కత్తితో పొడిచి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాల

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. ఓ జూదగాడు.. పేకాటలో డబ్బు పోవడాన్ని తట్టుకోలేక ఆ కోపాన్ని భార్యపై చూపించాడు. ఫలితంగా ఆమెకు కత్తితో పొడిచి చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మసౌలి గ్రామానికి చెందిన మనోజ్ అకా సోనూ అనే వ్యక్తికి గాగపురా ప్రాంతానికి చెందిన ఓ మహిళతో పెళ్లి అయింది. జూదానికి అలవాటు పడిన సోనూ పేకాటలో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో మామ ఆ డబ్బులు ఇచ్చి ఇకపై జూదం మానివేయాలని అల్లుడిని అభ్యర్థించాడు. అయినా అతడిలో మార్పు రాలేదు.
 
దీంతో మరోసారి పేకాటలో 5 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ డబ్బును కూడా భార్యను సర్ధుబాటు చేయాలని కోరాడు. డబ్బు ఇవ్వకపోతే చంపేసేలా ఉన్నాడని భార్య తండ్రికి ఫోన్ చేసింది. ఆ మరుసటి రోజే కూతురు మరణించిందని, అల్లుడే కూతుర్ని చంపేశాడని మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జూదగాడి నిర్వాకంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.