మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (18:28 IST)

రెండు పులులు చుట్టుముట్టాయి.. బైకుపై ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలుసా? (వీడియో)

పులిని చూస్తే మీరేం చేస్తారు..? ఇంకా రెండు పులులు కనిపిస్తే.. భయంతో పరుగులు తీయరూ..? కానీ మహారాష్ట్రలో రెండు పులులు కనిపించినా.. బైకు మీద వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం చలించకుండా వాటి బారి నుంచి బయ

పులిని చూస్తే మీరేం చేస్తారు..? ఇంకా రెండు పులులు కనిపిస్తే.. భయంతో పరుగులు తీయరూ..? కానీ మహారాష్ట్రలో రెండు పులులు కనిపించినా.. బైకు మీద వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఏమాత్రం చలించకుండా వాటి బారి నుంచి బయటపడ్డారు.

ఒళ్లు గ‌గుర్పాటు క‌లిగించే ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర‌లోని ఓ అడ‌వి గుండా వెళ్తున్న దారిలో ఇద్దరు బైకు మీద వెళ్తున్నారు. అయితే బైక్ మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు పులులు కనిపించాయి. భయంతో బండిని ఆపేశారు. అంతే బైకు మీద కూర్చున్న ఇద్ద‌రు వ్య‌క్తుల దగ్గరకు పులులు వచ్చాయి. వీడియో తీస్తున్న వారు క‌ద‌ల‌కుండా ఉండాల‌ని వారిస్తుండ‌టం, ఒక పులి కూర్చుని వుండగా.. మరో పులి మాత్రం వ్యక్తులకు వద్దకు వచ్చి అలా వెళ్ళింది. 
 
అదృష్ట‌వ‌శాత్తు పులులు ఆ వ్యక్తులు దాడి చేయలేదు. ఇక బైక్ మీద ఉన్న వ్య‌క్తులు కూడా వాటిని రెచ్చ‌గొట్టే ప‌నులేవి చేయ‌క‌పోవ‌డం క‌లిసి వ‌చ్చింది. ఇక ఈ తతంగాన్నంతా వీడియో తీస్తున్న కారు వాళ్ల ద‌గ్గ‌రికి వెళ్లింది. ఏమాత్రం కదలకుండా వుండమని కారులోని వారు సలహా ఇచ్చారు.

ఆపై వారి బైకు వద్దకు వెళ్లి వారిని లోప‌లికి ఎక్కించుకుని వేగంగా అక్క‌డి నుంచి బ‌య‌ట‌పడిన‌ట్లు స‌మాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ.. బైకుపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు పులుల బారి నుంచి తప్పించుకున్న వైనాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.