శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (10:52 IST)

ఇంద్రాణి ఒత్తిడి చేయడంతోనే షీనా బోరా సంతకాన్ని ప్రాక్టీస్ చేశా!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు పుంజుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అందరినీ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో షీనా సంతకం ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా మారింది. షీనా బోరా పనిచేసిన రిలయన్స్ సంస్థకు ఆమె రాజీనామా పత్రాన్ని ఎప్పుడు పంపించారు? ఇందులో సంతకం ఎవరు పెట్టారు? అనే దానిపై ఇంద్రాణి ముఖర్జియా పర్సనల్ సెక్రటరీ కాజల్ శర్మను అధికారులు విచారించారు.
 
షీనా బోరా రాజీనామా పత్రంపై తానే సంతకం పెట్టానని కాజల్ శర్మ అంగీకరించింది. షీనా సంతకాన్ని ప్రాక్టీస్ చేసి రిలయన్స్ సంస్థకు పంపాలని ఇంద్రాణి తనను కోరారనే విషయాన్ని కూడా కాజల్ శర్మ పోలీసు విచారణలో తెలిపారు. దీంతో షీనా హత్యకు ఇంద్రాణీనే ప్రధాన కారణమని అధికారులు చెప్తున్నారు. షీనా అమెరికాలో ఉందని, సంస్థ రాజీనామా లెటర్ అడుగుతోందని, వెంటనే చేసి పంపాలని చెప్పారని, దీంతో తన యజమాని చెప్పినట్టు చేశానని ఆమె దర్యాప్తు అధికారులకు వెల్లడించారు.