బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 30 ఆగస్టు 2017 (11:27 IST)

ఆపరేషన్ థియేటర్‌లో తన్నుకున్న వైద్యులు.. బిడ్డ మృతి... ఎక్కడ? (Video)

ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఘర్షణపడ్డారు. అంతేనా.. ఈ గొడవలు శృతిమించడంతో తన్నుకున్నారు. వీరితన్నులాటకు నవజాతశిశువు కన్నుమూసింది. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు ఘర్షణపడ్డారు. అంతేనా.. ఈ గొడవలు శృతిమించడంతో తన్నుకున్నారు. వీరితన్నులాటకు నవజాతశిశువు కన్నుమూసింది. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని ఉమైద్ ఆస్పత్రిలో వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తించారు. గర్భిణికి శస్త్రచికిత్స చేస్తూ.. ఇద్దరు వైద్యులు గొడవపడ్డారు. ఈ క్రమంలో తల్లీ శిశువు ప్రాణాలు కోల్పోయారు. 
 
దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విచారణకు ఆదేశించారు. ఆపరేషన్ థియేటర్‌లో గొడవ పడిన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. వైద్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు.