శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:22 IST)

ఆర్మీలో దళితులు చేరితే.. ఫారిన్ లిక్కర్ తాగొచ్చు.. బాగా తినొచ్చు: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆ

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆర్మీలో చేరితో.. రమ్ము, మంచి భోజనం లభిస్తాయని అధవాలే కామెంట్స్ చేశారు. అయితే రాందాస్ అథవాలే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దళితులు దేశరక్షణలో పాలుపంచుకోవాలని, దేశంకోసం ఎటువంటి త్యాగానికైనా దళిత యువకులు ముందుంటారు కనుకే రిజర్వేషన్‌కు డిమాండ్ చేస్తున్నామని అధవాలే స్పష్టం చేశారు. దళితులు చౌకబారు మద్యానికి బానిసలవతున్నారని.. అలాకాకుండా ఆర్మీలో చేరితో మంచి భోజనంతో పాటు రమ్ము అందుబాటులో వుంటాయని సూచించారు. అయితే రాందాస్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వున్నాయని.. దళితులంతా మద్యానికి వ్యసనపరులుగా వున్నారనే అర్థం వచ్చేలా అధవాలే చేసిన కామెంట్స్‌‌ వున్నాయని పలువురు ఫైర్ అవుతున్నారు.