నా భర్తే నగ్న ఫోటోలు నెట్లో పోస్ట్ చేసి వ్యభిచార రొంపిలోకి దించాడు: రష్మీ
'కిస్ ఆఫ్ లవ్ ఫేమ్' రష్మీ కట్టుకున్న భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. నా నగ్న ఫోటోలను తన భర్త నెట్లో పోస్ట్ చేసి ప్రముఖులతో డీల్ చేసినట్టు కేరళ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
కేరళలో మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా గత యేడాది కిస్ ఆప్ లవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన రష్మి, రాహుల్ దంపతులు అనంతరం పాపులర్ అయ్యారు. అయితే ఈ ముసుగులో ఆన్లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు ఇటీవల వెలుగుచూసింది. ఈ సంస్థ ప్రముఖులైన రష్మి, రాహుల్తో పాటు మరి కొందరు ఇటీవల జరిగిన పోలీస్ రైడ్స్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. దీంతో కేరళ ప్రభుత్వం ఈ ఆన్లైన్ సెక్స్ వ్యాపారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసులో రష్మి, రాహుల్తో పాటు పది మందిని అరెస్టు చేశారు. అయితే తన భర్త రాహుల్ ఈ ఆన్లైన్ సెక్స్ వ్యాపారానికి సూత్రధారి అని, ఆయనే తనను ఈ వ్యభిచార రొంపిలోకి దించాడని రష్మి పోలీసులకు తెలిపింది. రష్మి పేరుతో రాహుల్ క్రియేట్ చేసిన ఫేస్బుక్ ఖాతాను కూడా పోలీసులు గుర్తించారు. అందులో యువతుల నగ్న ఫోటోలు పోస్ట్ చేసి విటులను ఆకర్షిస్తున్నట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.