శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (17:58 IST)

మణిపూర్ ఎన్ఐటీలో తెలుగు విద్యార్థులపై దాడి!

మణిపూర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తెలుగు విద్యార్థుల పైన స్థానిక విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. స్థానికేతరులైన మీరు తమకు అణిగిమణిగి ఉండాలని వారు దాడికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.
 
బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు బీహార్ విద్యార్థులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు, యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన సరైన స్పందన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.