బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (15:02 IST)

టెక్నాలజీ పెరిగినా నో యూజ్.. "గే'' భాగస్వామి కోసం ఇలా చేశాడు..

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల

టెక్నాలజీ యుగంలోనూ మూఢనమ్మకాలు పెరుగుతూనే వున్నాయి. కాళికాదేవిపై అపారమైన భక్తిని చూపే క్రమంలో తనతో సహజీవనం చేస్తున్న యువకుడి కోసం మరో యువకుడు ప్రాణాలు అర్పించాడు. ఈ ఘటన భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, నానో టెక్నాలజీ రీసెర్చర్‌గా ఉన్న నీలోప్తల్ సర్కార్ (27).. తన గే భాగస్వామి ప్రాణాలు కాపాడటం కోసం ఆదివారం అప్పర్ లేక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
కాళికాదేవిపై అమితమైన భక్తి విశ్వాసాలను చూపే నీలోత్పల్.. చనిపోయేందుకు ముందు శాస్త్రవేత్తలను ఉద్దేశించి లేఖ రాశాడు. ఫేస్ బుక్‌లోనూ వీడియో పోస్టు చేశాడు. కానీ అతన్ని కనుగొనేలోపే చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో గౌహతీలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి.. ఆపై నదిలో దూకేందుకు ఇతడు ప్రయత్నించగా.. నీలోత్పల్‌ను స్థానికులు కాపాడారు. 
 
అయితే తన గే భాగస్వామి అనారోగ్యంతో బాధపడుతుంటే.. తన చావు అతడిని కాపాడుతుందనే ఉద్దేశంతో నీలోత్పల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో జన్మలో తన భాగస్వామితో కలుస్తానని ఆ లేఖలో నీలోత్పల్ వెల్లడించారు.