శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 23 మార్చి 2016 (11:33 IST)

ప్రేమ జంటను నగ్నంగా మార్చిన యువకులు.. ఎక్కడ?

విహారానికి వచ్చిన ప్రేమజంటపై ఇద్దరు యువకులు బెదిరించి నగ్నంగా మార్చి, ఆ వీడియోను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, ఆపై ఆత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని కొరటిగెరె తాలూకా కేంద్రంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా పరిధిలో గల కొరటిగెరె సమీపంలోని శ్రీ సిద్దర కొండపై ఆదివారం ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే చిక్కనాయకనహళ్లికి చెందిన సదరు యువతి, యువకుడు  స్థానిక గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో కొరటిగెరెలో ఉన్న శ్రీసిద్దర కొండపైకి విహారయాత్ర కోసం వెళ్లారు. సరదాగా కొంచెం సేపు కొండమీదనే వీరిద్దరు గడిపారు. అక్కడ ఇద్దరు యువకులు ఆ ప్రేమజంటను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అప్పుడు ఆ జంటతో దుస్తులు విప్పి నిలబడాలని, లేదంటే ఇప్పటివరకు తీసిన వీడియోను ఇంటర్నెట్లో పెడతామని బెదిరంచారు.
 
దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ జంట ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా మారారు. తర్వాత వారు యువతిపై అత్యాచారానికి యత్నించగా ఆ జంట తప్పించుకుని రాత్రంతా కొండపైనే ఉన్నారు. తెల్లవారు జామున, చెట్ల ఆకులు ఒంటికి కట్టుకొని కిందికి దిగి సమీపంలోని సమీపంలోని గ్రామానికి వెళ్లి, అక్కడి వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఇద్దరు యువకుల కోసం గాలింపు చేపట్టారు.