పార్కులో పోలీసులకు చిక్కిన ప్రేమ జంట.. రూ.200 ఫైన్ కోసం జీపెక్కించారు..
ప్రేమ జంటలు పార్కులకు వెళ్లడం సాధారణం. అయితే పార్కుల్లో అసాంఘిక చర్యలు జరిగిపోతున్నాయని.. లవర్స్ను అరెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరి ప్రేమికులు కాని జంటలు అరెస్టయిన దాఖలున్నాయి. కానీ కొద్
ప్రేమ జంటలు పార్కులకు వెళ్లడం సాధారణం. అయితే పార్కుల్లో అసాంఘిక చర్యలు జరిగిపోతున్నాయని.. లవర్స్ను అరెస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరి ప్రేమికులు కాని జంటలు అరెస్టయిన దాఖలున్నాయి. కానీ కొద్ది రోజుల్లో వివాహంతో ఒక్కటి కానున్న ఓ జంట మాత్రం పోలీసులకు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం తిరువనంతపురంలోని ఓ పబ్లిక్ పార్క్కు విష్ణు, ఆర్తి అనే ఓ ప్రేమ జంట వెళ్లింది. వారిద్దరూ ఓ దగ్గరికి వెళ్లి కూర్చోగానే.. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ వచ్చి వారిద్దరిని బెదిరించారు.
వెంటనే విష్ణు ఫేస్బుక్లో ఉన్న లైవ్ ఆప్షన్ను క్లిక్ చేశాడు. జరిగిన వ్యవహారాన్నంతా ఫేస్బుక్లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. పోలీస్ స్టేషన్కు తాము రామని.. పబ్లిక్లో తాము న్యూసెన్స్ క్రియేట్ చేయలేదని.. అసభ్యంగా ప్రవర్తించనూ లేదని క్లారిటీ ఇచ్చినా.. కానిస్టేబుల్స్ వదల్లేదు. న్యూసెన్స్ కింద రెండు వందల ఫైన్ కట్టాలని తెలిపారు. అందుకు ఆ జంట ఒప్పుకోకపోవడతో.. పోలీసులు ఆ జంటను జీపెక్కించారు.
అలాగే ఫైన్ స్లిప్పై సంతకం చేసి... పోలీస్ జీప్ ఎక్కారు. జీప్లో సెల్ఫీ దిగారు. ఆ ఫోటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని చేయని తప్పుకు కూడా పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని.. ఆర్తి తెలిపింది.