శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 27 మే 2015 (12:17 IST)

స్వలింగసంపర్కులతో నిండిపోయిన మదర్సాలు : ముస్లిం ప్రొఫెసర్

దేశంలోని మదర్సాలన్నీ స్వలింగసంపర్కులతో నిండిపోయివున్నట్టు ముస్లిం వర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వెల్లడించారు. సాధారణంగా ముస్లింల విద్యా బోధనాలయాలుగా ఈ మదార్సాలు ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఇవన్నీ స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ తక్షణం నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. 
 
ఈ యూనివర్శిటీ చరిత్ర విభాగంలో పనిచేస్తున్న వసీమ్ టీవీ చానళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ "మేము మదార్సాలను తొలగించాలని కోరుతున్నాం. అక్కడ విశృంఖల స్వలింగ సంపర్కం జరుగుతోంది. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల్లో మౌలానాల ప్రమేయం ఉంది" అని ఆరోపించారు. ముస్లిం యువత భవిష్యత్తు మారాలంటే దేశంలోని మదార్సాలను నిషేధించాలని ఆయన కోరారు. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి.