శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (17:05 IST)

రూ.2500 లంచం.. రూ.100 నోట్లే కావాలన్న ఉద్యోగి.. ఏసీబీకి దొరికిపోయాడు.. ఎక్కడ..?

లంచం తీసుకోవడమే తప్పు. అలాంటిది ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచంగా రూ.100నోట్లే కావాలని పట్టుబడ్డాడు. పాత నోట్లు రద్దు కావడంతో.. వంద నోట్లనే లంచంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో బాధితులు ఏసీబీ ఫోన్ చేయడంతో అడ్డ

లంచం తీసుకోవడమే తప్పు. అలాంటిది ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచంగా రూ.100నోట్లే కావాలని పట్టుబడ్డాడు. పాత నోట్లు రద్దు కావడంతో.. వంద నోట్లనే లంచంగా ఇవ్వాలని పట్టుబట్టాడు. దీంతో బాధితులు ఏసీబీ ఫోన్ చేయడంతో అడ్డంగా బుక్కైపోయాడు. తమ వద్ద రూ.500 రూ.1000 నోట్లే ఉన్నాయని తీసుకోవాల్సిందిగా బాదితులు కోరినా పట్టించుకోలేదు. పెద్ద నోట్లు లంచంగా తీసుకోవడం కుదరదంటూ ఉద్యోగి తెగేసి చెప్పాడు. దీంతో విసిగిపోయిన వాళ్లు... ఇక లాభం లేదనుకుని డైరెక్ట్‌గా ఏసీబీ అధికారులకు ఫోన్ చేశారు. దీంతో, లంచావతారం అడ్డంగా బుక్కయ్యాడు. 
 
ఈ ఘటన మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మోహోల్ పంచాయతీలో జరిగింది. బాలాసాహెబ్ భికాజీ అనే వ్యక్తి అక్కడ వ్యవసాయాధికారిగా పని చేస్తున్నాడు. రూ. 2,500 లంచాన్ని వంద రూపాయల్లోనే ఇవ్వాలంటూ వేధిస్తున్న సమయంలో, ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 25 వంద రూపాయల నోట్లను లంచంగా ఇస్తేనే.. మీకు కావాల్సిన పని చేసి పెడ్తానని మొండికేయడంతో.. బాధితులు ఏసీబీ సమాచారం ఇచ్చారు. దీంతో అరెస్టయిన ఉద్యోగిపై పోలీసులు 7, 13 (1) మరియు 13 (2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.