శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (11:33 IST)

రైతు ఇంట్లో భోజనం.. రాత్రి బస..! ఫడ్నవిస్ ట్వీట్..!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విదర్భలోని ఒక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రాత్రి అక్కడే బస చేశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో నమోదు చేశారు. దేశంలో మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు అధికంగా జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుల సమస్యలు తీరకపోవడంతో మరణాలు మాత్రం ఆగడలేదు.
 
దీంతో రైతుల మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నడుంకట్టారు. ఆయన రాష్ట్రంలోని మూడు గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఆ సమయంలో విదర్భలోని 'యవత్ మల్' జిల్లా పింప్రి బూటి గ్రామంలో ముందుగా చనిపోయిన రైతుల భార్యలతో సమావేశమై మాట్లాడారు. 
 
అనంతరం విష్ణుజీ రంగారవు దుమ్నే అనే స్థానిక రైతు ఇంట్లో భోజనం చేసి, ఆ రోజు రాత్రి అక్కడే సీఎం గడిపారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయాన్ని ఫడ్నవిస్ ట్విట్టర్ ఖాతాలో పోస్టుచేసి, రైతు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను కూడా ఆయన పోస్టు చేశారు.