శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (10:11 IST)

బెంగుళూరులో దారుణం.. రోగిపై ఆంబులెన్స్‌లో అత్యాచారం...

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తె

దేశ ఐటీ రాజధాని బెంగుళూరు నగరం నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిపోతోంది. తాజాగా ఓ రోగి ఆంబులెన్స్‌లోనే అత్యాచారానికి గురైంది. మహిళా రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో ఓ కామాంధుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆ కామాంధుడు ఆంబులెన్స్ సిబ్బందిగా భావిస్తున్నారు. నగరంలోని బనశంకరి పరిధిలో రెండు రోజుల క్రితం జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
బనశంకరి ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జబ్బు చేయగా, ఆస్పత్రికి తరలించేందుకు ఆమె భర్త ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించాడు. ఆమెను ఆంబులెన్స్‌లోకి ఎక్కించి బాధిత మహిళ భర్త డ్రైవర్‌ పక్కన కూర్చున్నాడు. అంబులెన్స్‌లో ఉన్న ఉద్యోగి సిద్ధరాజు బాధిత మహిళపై అత్యాచారానికి యత్నించగా, అంబులెన్సు ఆస్పత్రికి చేరుకోవడంతో అతని పన్నాగం ఫలించలేదు.
 
రెండు రోజుల అనంతరం అనారోగ్యం నుంచి కోలుకున్న ఆమె ఈ ఘటనను కుటుంబసభ్యులకు వివరించింది. దీంతో వారు బనశంకరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సిద్ధరాజును అదుపులోకి తీసుకున్నారు.