శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (19:30 IST)

చాక్లెట్ తీసిస్తానని.. బాలికను లోబరుచుకున్నాడు.. పెదవులు కొరికాడు.. ఇంతలో?

తమిళనాడు, సేలం జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిని చాక్లెట్ తీసిస్తానని చెప్పి ఓ మెకానిక్ అత్యాచారయత్నం చేశాడు. ఇంతలో చిన్నారి సోదరి చూసి అమ్మకు చెప్పడంతో ఆ బాలిక ఆ కామాంధుడికి బలవకుండా తప్పించుకుంది. వివ

తమిళనాడు, సేలం జిల్లాలో తొమ్మిదేళ్ల చిన్నారిని చాక్లెట్ తీసిస్తానని చెప్పి ఓ మెకానిక్ అత్యాచారయత్నం చేశాడు. ఇంతలో చిన్నారి సోదరి చూసి వారి అమ్మకు చెప్పడంతో ఆ బాలిక ఆ కామాంధుడికి బలవకుండా తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే.. సేలం జిల్లా, ఆనైయాంపట్టి పుదూరుకు చెందిన 28 ఏళ్ల త్యాగరాజన్.. మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు తన షాపుకు ఎదురుగా వున్న ఇంట్లోని చిన్నారిని పిలిచి చాక్లెట్ తీసిస్తానని.. డాబాకు తీసుకెళ్లాడు. 
 
దీన్ని చూసిన చిన్నారి సోదరి.. ఆమె తల్లికి చెప్పింది. వీరిద్దరూ కలిసి మెకానిక్ షాపు డాబాకు వెళ్ళి చూడగా... అతడు అత్యాచారయత్నం చేశాడు. దీంతో బాలిక తల్లి పెద్దగా అరిచేసింది. అంతే మెకానిక్ గోడదూకి పారిపోయాడు. బాలిక ఏడుస్తూ అమ్మ దగ్గరికి చేరుకుంది. ఈ ఘటనలో బాలిక పెదవులను మెకానిక్ కొరికేశాడు. ఇంకా బాలికకు గాయాలు కావడంతో ఆమెను ఆస్పత్రిలోకి చేర్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మెకానిక్‌ను అరెస్ట్ చేశారు.