శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (16:09 IST)

వ్యభిచారం చేసిన భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడు.. ఎక్కడ?

భార్య వ్యభిచారం చేసిందని.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. అంతే భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ నగరానికి చెందిన మార

భార్య వ్యభిచారం చేసిందని.. ఆ భర్త జీర్ణించుకోలేకపోయాడు. అంతే భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలో క్వీన్స్‌లాండ్ నగరానికి చెందిన మార్కస్ వోల్కీ (27) భార్య మయాంగ్ (23)లకు గత 2013లో వివాహం జరిగింది. మార్కస్‌కు ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో.. భార్యతో వ్యభిచారం చేయించాలని నిర్ణయించాడు. అందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఇలా ఆన్‌లైన్‌లో వీరి వ్యాపారం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యను సరిచేయాల్సిందిగా విద్యుత్ అధికారులను ఇంటికి పిలిపించాడు మార్కస్. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగులు మార్కస్ ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చిన అధికారులు అక్కడ దుర్వాసన రావడంతో ముక్కులు మూసేశారు. అప్పుడు మార్కస్ వండుతున్నాడని, అతను వండేది పంది కూర అని చెప్పినట్లు అధికారులు తెలిపారు. 
 
దీంతో విద్యుత్ శాఖాధికారులు పని ముగించుకుని.. మార్కస్ వోల్కీ ఇంటి నుంచి బయటపడి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మార్కస్ ఇంటికి చేరుకున్నారు. ఈ లోపు మార్కస్ గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్కస్ ఇంట్లో జరిపిన తనిఖీల్లో అతడు తన భార్యను చంపి.. కుక్కర్లో వండేశాడని తెలిసింది. 2014లో ఈ ఘటన చోటుచేసుకున్నా.. 3ఏళ్ల  తర్వాతే భార్య హత్యకు విబేధాలే కారణమని కనుగొన్నారు.